జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..

- ఇద్దరు ఉగ్రవాదులు హతం

0
TMedia (Telugu News) :

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..

– ఇద్దరు ఉగ్రవాదులు హతం

టీ మీడియా, అక్టోబర్ 26, జమ్మూ కశ్మీర్‌ : జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుప్వారా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మచల్‌ వద్ద నియంత్రణ రేఖ గుండా చొరబాటు యత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో కుప్వారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Also Read : కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేఖ పార్టీ

‘కుప్వారా పోలీసులు అందించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా.. మచల్ సెక్టార్‌ లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొన‌సాగుతోంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube