పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

0
TMedia (Telugu News) :

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

టీ మీడియా, ఫిబ్రవరి 28, పుల్వామా : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు చనిపోయాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. మృతుడిని పుల్వామాకు చెందిన అఖిబ్‌ ముస్తాఖ్‌ భట్‌గా గుర్తించామన్నారు. హిజ్బ్‌ల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడని వెల్లడించారు. కశ్మీరీ పండిట్‌ సంజయ్‌ శర్మ హత్యలో అతడు కూడా పాలుపంచుకున్నాడని వెల్లడించారు.పుల్వామాలో కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదుల కాల్చి చంపిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం.

Also Read : అఫ్గానిస్థాన్‌, తజకిస్థాన్‌లో వరుస భూకంపాలు

పుల్వామా జిల్లాలోని అచన్‌కు చెందిన సంజయ్‌ శర్మ అనే కశ్మీరీ పండిట్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి స్థానిక మార్కెట్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు ఆయనను ఛాతిపై కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలించేలోపే ప్రాణం పోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 నుంచి 9 మంది పండిట్లను ఉగ్రవాదులు కాల్చి చంపారని స్థానికులు చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube