షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. టీఆర్‌ఎఫ్‌ ఉద్రవాది హతం

షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. టీఆర్‌ఎఫ్‌ ఉద్రవాది హతం

0
TMedia (Telugu News) :

షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. టీఆర్‌ఎఫ్‌ ఉద్రవాది హతం

టీ మీడియా, నవంబర్ 9, శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. గురువారం తెల్లవారుజామున షోపియాన్‌లోని కతోహలెన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. అతడిని ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ఘటనలో రామ్‌గఢ్‌ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో ఓ జవాన్‌ గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Also Read : మ‌ణిపూర్‌లో న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు మొబైల్ ఇంట‌ర్నెట్ నిషేధం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube