30,31 ఎంసెట్ పరీక్షలు
టి మీడియా,జూలై20,హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్, ఈసెట్ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
Also Read : నిరుపేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేత
ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను, ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు టీఎస్ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా వెబ్సైట్ల నుంచి సంబంధిత అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సూచించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube