ప్రజలకు నామ దీపావళి శుభాకాంక్షలు

- అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి

0
TMedia (Telugu News) :

ప్రజలకు నామ దీపావళి శుభాకాంక్షలు

– అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి

– ఎంపీ నామ నాగేశ్వరరావు

టీ మీడియా, నవంబర్ 11, ఖమ్మం బ్యూరో : ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులు అంతంత పవిత్రంగా , భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో దీపావళి ముఖ్యమైనదని అన్నారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి , నిరాశపై ఆశ విజయానికి ప్రతీకగా జరువుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జీవితంలోని చీకట్లను పారదోలి వెలుగులు నింపేదే దీపావళి అన్నారు. దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగుల్లో కుటుంబంతా జరుపుకునే వేడుకలని పేర్కొన్నారు. ఈ పండుగ వేళ అంతా సుఖ సంతోషాలుతో జీవించాలని అన్నారు.తమ జీవితాల్లోని చీకట్లను తరిమేసి తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సంపద, ఐశ్వర్య వృద్ధి, ఆరోగ్యంతో తులతూగాలన్నారు.

Also Read : సండ్ర వెంకట వీరయ్య గెలిస్తెనే నియోజకవర్గం అభివృద్ధి

మహా లక్ష్మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి ఇంట సిరులు, ఐశ్వర్యం వృద్ధి చెందాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. నరకాసురుడి వధించిన సందర్భంలో ప్రజలు దీపాలు వెలిగించి, అందోత్సాహాలతో స్వాగతం పలికారని,అలాగే ఈ ఎన్నికల్లో కూడా దూస్టత్వాన్ని తుదముట్టించి, విజయం సాధించి,హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కు విజయ దరహాసంతో ఘన స్వాగతం పలుకుదామని పేర్కొన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం గా బాధ్యతలు తీసుకోగానే అందరం మరింత సంతోషంతో పండుగ జరువుకుందామని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube