తిరుమలలో అక్రమాల నివారణకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ
తిరుమలలో అక్రమాల నివారణకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ
తిరుమలలో అక్రమాల నివారణకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ
లహరి, ఫిబ్రవరి 21, తిరుమల : తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.