కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక

కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక

0
TMedia (Telugu News) :

కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక

టీ మీడియా, నవంబర్ 15, విజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సినీ నటి హన్సిక బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన హన్సికకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. హన్సికకు అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. దర్శనానంతరం హన్సిక మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘మై నేమ్ ఇస్ శృతి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వచ్చాను. నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైస్‌గా నా చిత్రం రిలీజ్ కానుంది. ప్రేక్షకులందరూ నా చిత్రాన్ని ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నాను’’ అని హన్సిక తెలిపారు.

Also Read : రైతుబంధు రాజ్యం కావాలా.. రాబందుల రాజ్యం కావాలా..?

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube