వర్క్‌షాప్‌లో మంటలు.. 36 మంది సజీవ దహనం

వర్క్‌షాప్‌లో మంటలు.. 36 మంది సజీవ దహనం

1
TMedia (Telugu News) :

వర్క్‌షాప్‌లో మంటలు.. 36 మంది సజీవ దహనం

టీ మీడియా, నవంబర్ 22, బీజింగ్‌ : చైనాలోని హెనాన్స్‌ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగి 36 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డనట్లు స్థానిక మీడియా తెలిపింది. అన్యాంగ్ సిటీలోని ‘హైటెక్ జోన్’లో సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు ఏడెనిమిది గంటల పాటు శ్రమించి రాత్రి 11 గంటలక వరకు అదుపులోకి తీసుకువచ్చారు.

Also Read : మిస్సైల్‌ ప్రయోగాలను ఖండించిన భారత్‌

మంగళవారం ఉదయం వరకు ప్రమాదంలో 36 మృతి చెందారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube