పామాయిల్‌ ఇంధనంతో తొలిసారి నింగికెగిరిన విమానం

పామాయిల్‌ ఇంధనంతో తొలిసారి నింగికెగిరిన విమానం

0
TMedia (Telugu News) :

పామాయిల్‌ ఇంధనంతో తొలిసారి నింగికెగిరిన విమానం

టీ మీడియా, అక్టోబర్ 30, జకర్త : పామాయిల్‌ ఉపయోగించి తయారు చేసిన ఇంధనంతో ఒక ప్రయాణీకుల విమానం తొలిసారి నింగికెగిరింది. ఇండోనేషియాకు చెందిన విమానయాన సంస్థ గరుడ ఇండోనేషియా ఈ విషయాన్ని తెలిపింది. పామాయిల్‌తో కలిపిన విమాన ఇంధన ఉపయోగించి కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాన్ని విజయవంతంగా నడిపినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ ఇంధనంతో బోయింగ్‌ 737 – 800 ఎన్‌జి విమానం 100 మందికి పైగా ప్రయాణీకులతో శుక్రవారం బాంటెన్‌ ప్రావిన్స్‌లోని సోకర్నాహట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్‌ జావాలోని ఆది సోమార్మో అంతర్జాతీయం విమానాశ్రయానికి బయలుదేరిందని తెలిపింది. ‘ఇది మొదటిసారి. విజయవంతమైన ట్రయల్‌.

Also Read : ఈడీ విచారణకు హాజరైన రాజస్థాన్‌ సీఎం కుమారుడు వైభవ్‌

ఒక వాణిజ్య విమానానికి జీవ ఇంధనాన్ని ఉపయోగించాం’ అని గరుడ ఇండోనేషియా అధ్యక్షులు డైరెక్టర్‌ ఇర్ఫాన్‌ సెటియాపుత్ర వెల్లడించారు. ప్రత్యామ్నాయ జెట్‌ ఇంధనాన్ని ఇండోనేషియా ప్రభుత్వ ఇంధన సంస్థ పిటి పెర్టమినా ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద పామాయిల్‌ ఉత్పత్తిదారుగా ఇండోనేషియా ఉన్న సంగతి తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube