కాళేశ్వరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
టి మీడియా,జులై15,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజికి 28,62,390 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో 28,67,650 క్యూసెక్కులకు చేరుకుంది.
Also Read : భద్రాచలానికి హెలికాప్టర్ తరలించండి
అన్నారం బ్యారేజీకి 11,39,665 క్యూసెక్కుల నీరు వస్తుండగా 66 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గోదవారికి భారీగ వరద పోటెత్తడంతో జలదిగ్బంధంలో 70కి పైగా గ్రామాలున్నాయి. కన్నాయిగూడెం, వెంకటాపురం, ఏటూరు నాగారం.. మంగపేట మండలాల్లో వరద ముంచెత్తుతున్నది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube