విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ కార్‌ రేసు

విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ కార్‌ రేసు

0
TMedia (Telugu News) :

విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ కార్‌ రేసు

టి మీడియా, ఫిబ్రవరి 11, హైదరాబాద్ : వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసుర్లు దూసుకెళ్లాయి. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు.

Also Read : ఆప్‌కి మరో ఎదురుదెబ్బ

కాగా కార్ల వేగం ప్రేక్షకుల కేరింతలతో సాగరతీరం హోరెత్తిపోయింది. సాగరతీరాన జరిగిన ఫార్ములా ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు రామ్‌ చరణ్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ హాజరయ్యారు. వీరితో పాటు సచిన్‌, చాహల్‌, ధావన్‌ తదితరులు ఫార్ములా ఈ రేసు వీక్షించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube