లాక్డౌన్ ఉల్లంఘన కేసులన్నీ ఎత్తేస్తున్నాం..
టీ మీడియా ,మార్చి 29,ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లాక్డౌన్ సమయంలో విద్యార్థులు, పౌరులపై నమోదు అయిన కేసులన్నీ ఎత్తివేయనున్నది. కరోనా సమయంలో గత రెండేళ్లలో నమోదు అయిన కేసులను రద్దు చేసేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. ఐపీసీ 188 సెక్షన్ కింద ఆ కేసులన్నీ నమోదు అయ్యాయి. రాష్ట్ర క్యాబినెట్ ముందు త్వరలో ఈ ప్రతిపాదన చేయనున్నట్లు ఆయన చెప్పారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నమోదు అయిన అన్ని కేసులను ఎత్తివేస్తామని మంత్రి పాటిల్ తెలిపారు. లాక్డౌన్ కర్ఫ్యూ వేళల్లో తిరగడం, గ్రూపులుగా తిరగడం, పబ్లిక్ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిపై కేసులను బుక్ చేశారు.
Also Read : చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube