గొత్తి కోయలు తెలంగాణ గిరిజనులు కారు
-మంత్రి సత్యవతి రాథోడ్
టీ మీడియా,నవంబర్ 25,హైదరాబాద్: గొత్తికోయలపై మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గొత్తికోయలు తెలంగాణ గిరిజనులు కాదన్నారు.తెలంగాణలో వారికి ఎలాంటి హక్కు లేదన్నారు.ప్రభుత్వ పథకాలకు గొత్తికోయలు అర్హులు కారన్నారు.
Also Read : 27 సిద్దారెడ్డి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు వారు బ్రతుకు దెరువు కోసం వచ్చారన్నారు.పోడు భూముల పట్టాలకు కూడా వారికి ఎలాంటి అనుమతి లేదన్నారు.గొత్తికోయలపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు.కాగా ఇటీవల గొత్తికోయలు పోడుసాగుకు అడ్డొస్తున్నాడనే కారణంతో అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావుపై కత్తులతో గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube