గుండెపోటు తో కుప్పకూలిన గవర్నర్ అటెండర్
టి మీడియా, ఎప్రిల్ 22,హైదరాబాద్ : సికింద్రాబాద్ స్కంధగిరి టెంపుల్లో గురువారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలోనే గవర్నర్ అటెండర్ రాజ్కుమార్(47) ఆలయంలోనే కుప్పకూలిపోయాడు.దీంతో ఆయనను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Also Read : ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు గాంధీ వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే రాజ్ కుమార్ మృతి చెందినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రి నుంచి రాజ్భవన్కు మృతదేహాన్ని తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజ్కుమార్ మృతితో రాజ్భవన్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube