పేదల చెంతకు ప్రభుత్వ వైద్యం చారిత్రక నిర్ణయం
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టీ మీడియా, నవంబర్ 25, రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని , దీంట్లో భాగంగా పేదల వద్దకే వెళ్లి ప్రభుత్వ వైద్యాన్ని అందించడం చారిత్రక నిర్ణయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీ పహాడి షరీఫ్ దర్గా సమీపంలో, కొత్తపేట్ గ్రామంలో బస్తీ దవఖానాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బస్తీలలో నివాసముండే నిరుపేదల చెంతకే వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని తెలిపారు.
Also Read : శిల్పా లేవుట్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన కేటీఆర్
ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా బస్తీ దరఖాన ఇన్చార్జి వినోద్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ శారద శ్రీనివాస్, జల్పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా పాల్గొన్నారు.