కేంద్రం చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
కేంద్రం చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
కేంద్రం చేతిలో గవర్నర్లు కీలు బొమ్మలు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
టీ మీడియా, జనవరి 18,ఖమ్మం : దేశాన్ని అభివృద్ధి చేయడం ఎలా.. రైతులకు ఏం చేయాలి, కార్మికులకు ఏం చేయాలనే దానిపైన ఇవాళ ముఖ్యనేతలందరం కలిసి చర్చించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కేరళలో విద్యాసంస్థలు అద్భుతంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితి దేశంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్గుతగలడమే గవర్నర్ల పని అన్నట్లు ఉందని కేజ్రీవాల్ అన్నారు. గవర్నర్లు కేవలం కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.కేసీఆర్ మాకు పెద్దన్న లాంటివారు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
Also Read : సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కి వినతి
కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అని, కంటి వెలుగు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, పంజాబ్లోనూ ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. తెలంగాణలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని కొనియాడారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube