అరటిపండ్లు ఎక్కువగా తింటే.

అరటిపండ్లు ఎక్కువగా తింటే.

0
TMedia (Telugu News) :

అరటిపండ్లు ఎక్కువగా తింటే.?

లహరి, అక్టోబర్ 14, ఆరోగ్యం : సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో దొరికేది.. అరటిపండు. ఈ పండు సామాన్యులకు అందుబాటు ధరల్లో, తినడానికి సౌలభ్యంగా, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండు తక్షణ శక్తిని అందిస్తుంది, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. దీనిలో ఫ్యాట్స్‌, పిండిపదార్థాలు, ప్రోటిన్‌, ఫైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, పెప్టిన్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, విటమిన్‌-సి, విటమిన్‌-బి6 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఆరోగ్యానికి మంచిదని అరటిపండ్లు అతిగా తింటే.. అనర్థాలు తప్పవని నిపుణులు అంటున్నారు. అరటిపండ్లు ఎక్కువగా తింటే.. ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయో ఈ స్టోరీలో చూద్దాం.

బరువు పెరుగుతారు :
అరటిపండ్లు మితంగా తీసుకుంటే.. మన ఆరోగ్యానికి మేలు చేస్తాయ్, బరువు తగ్గడానికి సహాయపడతాయి. అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆకలిని అరికట్టడానికి సహాయపడుతుంది. అదే సమయంలో బరువు పెరగడానికి ఇది ప్రధాన కారణం. అరటిపండ్లు అతిగా తింటే.. బరువు పెరుగుతారని నిపుణులు హచ్చరిస్తున్నారు. రోజుకు 1 నుంచి 2 అరటిపండ్లు తింటే సరిపోతుంది.

Also Read : బతుకమ్మ వేడుకల్లో పూలనే ఎందుకు పూజిస్తారు.?

మైగ్రేన్‌ను ట్రిగ్గర్‌ చేస్తుంది :
అరటిపండ్లు తొక్క సరిగ్గా తీయకుండా తింటే.. మైగ్రెన్‌ను ట్రిగ్గర్‌ చేస్తుంది. అరటిపండు తొక్కలో టైరమైన్‌ అనే పదార్థాం ఉంటుంది. మన శరీరంలో, మోనోఅమైన్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది టైరమైన్ వంటి మోనోఅమైన్‌లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఎంజైమ్ టైరమైన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి, మీరు మైగ్రేన్‌లతో బాధపడుతుంటే, మీ శరీరంలో తగినంత MAO లేకపోతే, టైరమైన్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మీకు తలనొప్పి వస్తుంది.

బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు పెరుగుతాయ్‌ :
షుగర్‌ పేషంట్స్‌ చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. అరటిపండులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. షుగర్‌ ఉన్నవారు అరటిపండ్లు అతిగా తినకపోవడమే మంచిది.

మగతగా ఉంటుంది :
అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల మానసిక పనితీరు తగ్గుతుంది. మగతగా అనిపించేలా చేస్తుంది. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ కంటెంట్ దీనికి కారణం. ట్రిప్టోఫాన్‌ ప్రోటీన్లు, సెరోటోనిన్ వంటి ముఖ్యమైన అణువులను తయారు చేయడానికి శరీరం ఉపయోగించే అమైనో యాసిడ్‌, ఇది మానసిక స్థితి, నిద్రను నియంత్రిస్తుంది.

Also Read : బతుకమ్మ పేర్చడం బౌద్దులు నేర్పించారా.

దంత సమస్యలు వస్తాయ్ :
అరటిపండులో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు అతిగా తీసుకుంటే.. దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. దంత క్షయానికి దారితీస్తుంది, ప్రత్యేకించి సరైన దంత పరిశుభ్రత పాటించకపోతే.

జీర్ణ సమస్యలు ఎదురవుతాయ్‌ :
అరటిపండులో కరిగే ఫైబర్, ఫ్రక్టోజ్‌, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో నీటి శాతం తక్కువగా ఉంటాయి. అరటిపండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురవుతాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube