ముంబైని ముంచెత్తిన వాన..
టి మీడియా,జులై7,ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. మహానగరంతోపాటు థానే, నవీ ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో ముంబైలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. అంధేరీ సబ్వే పూర్తిగా నీటమునిగింది. మాతుంగా ప్రాంతంలో రోడ్లపై వరదలు పారుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
నిరాటంకంగా వర్షం కురుస్తుండటంతో నగరంలోని చాలా చోట్ల రహదారులు చెడిపోయాయి.ముంబైలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది. మహానగరంలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, గత 1 నుంచి ఇప్పటివరకు ముంబైలో 958 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వెల్లడించింది. మరికొన్ని రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే వర్షపాతం తొందర్లోనే వెయ్యి మిల్లీమీటర్లకు చేరుతుందని ప్రకటించింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube