మూడో భార్యతో ప్రాణహాని ఉంది: నరేష్
టి మీడియా,జనవరి 27,హైదరాబాద్ : మూడో భార్య రమ్య రఘుపతితో పాటు రోహిత్ షెట్టి ల నుంచి తనకు ప్రాణ హాని ఉండడంతో రయణ కోసం కోర్టును ఆశ్రయించానని నటుడు నరేష్ తెలిపారు. పైసా కట్నం లేకుండా అనంతపురానికి చెందిన రమ్యను 2010 మార్చి 3న మూడో వివాహం చేసుకున్నానని ఆయన వివరించారు.మా అమ్మస్వర్గీయ విజయనిర్మల, రమ్యకు రూ.30 లక్షల విలువ చేసే బంగారు నగలు కూడా చేయించిందన్నారు. పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే వేధింపులకు గురి చేస్తున్నదని, 2012లో తమకు రణవీర్ జన్మించారన్నారు.
Also Read : విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మల్లు నందిని విక్రమార్క
తనకు తెలియకుండా పలు బ్యాంకుల నుంచి, పరిచయస్తుల నుంచి లక్షల రూపాయల అప్పులు చేసిందన్నారు.ఆమె చేసిన కొన్ని అప్పులు తీర్చానని, ఇవే కాకుండా రూ.50 లక్షల కూడా తీసుకుందన్నారు. నా ఆస్తి కాజేయాలనే దుర్బిద్ది పెంచుకున్నదని, ఒప్పుకోకపోవడంతో నన్నే చంపేందుకు సుఫారీ కూడా ఇచ్చిందన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube