తెలంగాణలో హాట్ సీట్

అందరి చూపు అటు వైపే

0
TMedia (Telugu News) :

తెలంగాణలో హాట్ సీట్

-అందరి చూపు అటు వైపే

-బీసీ ఓటర్లు ప్రభావం ఎక్కువ

-ఆసక్తికరంగా ” పా” లేరు రాజకీయాలు

టీ మీడియా, అక్టోబర్ 11, ఖమ్మం : ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, ఖమ్మంజిల్లా పాలేరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. అందరూ నేతలు పాలేరుపై కన్నేసి.. పోటీకి చేయడానికి రెడీ అవుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ఇవ్వడంతోప్రచారంలోదూసుకుపోతున్నారు. ఇప్పటికీ వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై స్పష్టత రాకపోవడంతో.. ఆమె సైతం పాలేరు నుంచే పోటీకి సై అంటున్నారు. సిపిఎం పొత్తులో భాగంగా తమ్మినేని వీరభద్రం ఈ సీటు కావాలని పట్టు బడుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ పాలేరు టికెట్ కావాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇప్పటి వరకూ స్పష్టత రాకపోవడంతో కేడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పాలేరు.. ఇపుడు హాట్ సీట్ గా ఎందుకు మారింది.. నేతలు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. పాలేరు నియోజకవర్గంపై స్పెషల్ స్టోరీ.. గత కొద్దిరోజులుగా ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆయా పార్టీలు ముఖ్యనేతలు పాలేరు నుంచి పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. ఏకంగా పార్టీలు మారి మరీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పాలేరు ఎందుకు ఇంత స్పెషల్ అయ్యింది.

Also Read : కోర్టు అనుమ‌తితో శిశువును చంపాల‌నుకుంటున్నారా

ఇక్కడే పోటీ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నదీ.. ఆసక్తికర చర్చ జరుగుతోంది..అందరి కంటే ముందు.. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో.. ఆయన నియోజక వర్గంలో ప్రచారంలో ముందున్నారు. అక్టోబర్ 27న ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సైతం పాలేరు నుంచే బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఒక విధంగా పాలేరు పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తుంది.కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. పాలేరు నియోజకవర్గంపైనే చర్చ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల్లో పాలేరు ఒకటి. ముఖ్య నేతలు ఎవరి మాట విన్నా.. పాలేరులో పోటీకి రెడీ.. దీంతో రాష్ట్రంలోనే పాలేరు హాట్ సీట్ గా మారింది. నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. వైఎస్ అభిమానులు, ఇతర సామాజిక వర్గాల ఓటు బ్యాంకు..కాంగ్రెస్ కు బలం. మొన్నటి ఎన్నికల్లోనూ సీనియర్ నేత, బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇంత బలమైన సీటుపై కాంగ్రెస్ ముఖ్య నేతలు కన్నేశారు..ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కాంగ్రెస్ లో చేరడంతో.. ఇపుడు ఆ ఇద్దరు నేతలు పాలేరు సీటు కావాలని పట్టుపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో వారికి ఫాలోయింగ్ ఎక్కువే. జిల్లాలో ప్రభావితం చేయగలిగే ఇద్దరు బలమైన నేతలు ఒక్కటయ్యారు. తమను దూరం చేసుకున్న బీఆర్‌ఎస్‌ను ఓడించి దెబ్బ కొట్టాలని.. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు..పాలేరులోనూ.. ఇద్ద లో ఎవరు పోటీ చేసినా గట్టి పోటీ తప్పదు! ఇంత హాట్ సీట్ గా మారిన పాలేరులో బీఆర్ఎస్ గెలుపు కోసం ఏ వ్యూహం అమలు చేస్తోంది. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారన్నదీ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిది లోకల్. పాలేరు నియోజక వర్గమే. షర్మిల, తుమ్మల, పొంగులేటి.. వీరంతా నియోజక వర్గానికి నాన్ లోకల్. ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.. ఈ అంశమే అధికార పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.ఏ ఆపద వచ్చినా..ప్రజల్ని ఆదుకోవడం, ఏ కారణంతో అయినా మరణిస్తే.. ఆ కుటుంబానికి తన ట్రస్టు తరపున పదివేలు ఆర్థిక సహాయం విస్తృతంగా చేశారు ఎమ్మెల్యే కందాల.

Also Read : నారా లోకేష్‌ బెయిల్‌ పిటిషన్‌ డిస్పోజ్‌

అంతే కాకుండా.. నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో ఆలయాలు, చర్చిలు, బొడ్రాయి నిర్మాణాలు, ప్రతిష్ట,ఉత్సవాలకు లక్షల్లో విరాళాలు ఇచ్చారు. సమస్య ఏదయినా.. తనను కలిసిన ప్రతి ఒక్కరికీ.. వెంటనే స్పందిస్తారనే పేరుంది ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి. ఈ ఐదేళ్ళల్లో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాల వివరాలతో.. ఇంటింటికి బుక్ లెట్స్, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. టికెట్స్ ప్రకటన తర్వాత ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతల్ని తమవైపు తిప్పుకునేందుకు వ్యూహం రచిస్తున్నారు. మొదటి నుంచి పాలేరు సీటు తనదేనని.. గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. కాంగ్రెస్ తరపున బలమైన నేతలు దిగుతున్నా పాలేరు సీటు నాదే అంటున్నారు కందాల.ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వైఎస్ షర్మిల ఎంట్రీతో పాలేరు పాలిటిక్స్ హీటేక్కాయి. గతంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల. ఆ తర్వాత పాలేరు నియోజక వర్గానికి పూర్తిగా దూరమయ్యారు. ఎలాంటి కార్యక్రమాలు లేకుండా సైలెంట్ కావడంతో.. ఆమె పాలేరు నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం జోరుగా జరుగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి సడన్ ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కరించి.. విగ్రహం సాక్షిగా పాలేరులోనే పోటీ చేస్తా అని ప్రతిజ్ఞ చేశారు. వెనక్కి తగ్గేదీలేదంటూ.. పోటీ పై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ లో 3,600 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై చర్చలు జరిపారు. కానీ.. ఇప్పటి వరకూ స్పష్టత రాక పోవడంతో..ఆమె తన పార్టీ నుంచే పాలేరులో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. పాలేరు బిడ్డను..ఇక్కడ నుంచే పోటీ చేస్తానని.. ఆమె మట్టి పట్టుకొని మరీ మాట ఇచ్చారు.హాట్ సీట్ గా మారిన పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? ఇపుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రోజుకో ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు నేతలు పాలేరు టికెట్ నాదంటే నాదేనని ప్రచారం చేసుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో.. ఊరూరా తిరిగి.. గణపతి విగ్రహాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ జనం దృష్టిని ఆకర్షించారు. పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పేరుతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తుమ్మల ఆరు గ్యారంటీ హామీలపై కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇరువురు నేతలు అనుచరులు తమకే టికెట్ ఖరారు అయ్యిందని ప్రచారం చేసుకుంటున్నారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇప్పటి వరకూ స్పష్టత రాక పోవడంతో..అయోమయం నెలకొంది. పాలేరు సీటు కోసమే.. కాంగ్రెస్ లో చేరాను.. ఖచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేస్తానని తుమ్మల ధీమా వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ప్రభావం చూపుతారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండటంతో గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం ఎస్టీ ఓటర్లు. నియోజకవర్గంలో డామినేషన్ మాత్రం ఓసీ వర్గాల వారిది. నియోజకవర్గంలో మొత్తం 14 సార్లు ఎన్నికలు జరుగగా 10 సార్లు కాంగ్రెస్,నాలుగు సార్లు ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి BRS లో చేరారు.ప్రస్తుత పాలేరు ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన గెలుపుకు కారణం రాజకీయాలకు కొత్త వ్యక్తి కావడంతో పాటు, గతంలో పలు సేవాకార్యక్రమలు చేయడంతో స్థానికత, పాలేరు లో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకు కలిసొచ్చాయి. రాష్ట్రం లోనే హాట్ సీట్ గా మారిన పాలేరులో ఎవరు పోటీ చేస్తారు. చివరికి పాలేరు గడ్డపై ఏ జెండా ఎగురుతుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్ట బోతున్నారన్నదీ వేచిచూడాలి.

Also Read ; టిడిపి బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిక

నియోజకవర్గం ముఖచిత్రం
మొత్తం ఓటర్లుః 2,30,347మొత్తం మండలంః 4 (కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, తిరుమల పాలెం)
1962లో ఏర్పడిన పాలేరు నియోజకవర్గం.ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలుకాంగ్రెస్ 10 సార్లు గెలుపుసీపీఎం 2 సార్లు గెలుపుసీపీఐ ఒక్కసారి విజయం BRS ఒక్కసారి గెలుపు2018 ఎన్నికల్లో కందాళ ఉపేందర్ రెడ్డి(కాంగ్రెస్).. తుమ్మల నాగేశ్వరరావు(బీఆర్ఎస్)పై 7,669 ఓట్ల మెజారిటీతో గెలుపు.సామాజిక వర్గాల వారీగా బీసీలు – 1,15,000ఎస్సీలు – 45,500,ఎస్టీలు – 37,600,ఓసీలు – 36,400.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube