తజికిస్థాన్ను వణికించిన భారీ భూకంపం
టీ మీడియా, ఫిబ్రవరి 23, తజికిస్థాన్ : సెంట్రల్ ఆసియా దేశమైన తజికిస్థాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. గురువారం తెల్లవారుజామున 5:37 గంటల సమయంలో అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపిచడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.