అటివిశాఖ అధికారి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ
టీమీడియా, నవంబర్.25, చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలో శుక్రవారం అటవీశాఖ సిబ్బంది ఖాకి యూనిఫారంలో ధరించి వలస అక్రమార్కుల దాడిలో అసువులు బాసిన అటవీ శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు హత్యకు నిరసనగా అటవీ శాఖ కార్యాలయం నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జోహార్ శ్రీనివాసరావు వలసవాదుల అక్రమార్కుల అడ్డగింపులో అసువులు బాసిన శ్రీనివాస్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అడవులను కాపాడేందుకు తమ ప్రాణాలు సహితం ఫణంగా పెట్టి విధి నిర్వహణ చేస్తున్న తమకు ప్రాణ రక్షణ కల్పించాలని అన్నారు.
Also Read : గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి
ఆత్మస్థైర్యంతో పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా సిబ్బందిని కాపాడే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ పీవో ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు. డీఎఫ్ఓ సాయిబాబా కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతూరు డివిజన్ స్థాయి అటవీ శాఖ సిబ్బంది మోహన్. విజయలక్ష్మి. బుచ్చిరాజు.తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube