జన శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు

జన శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు

0
TMedia (Telugu News) :

జన శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు

టీ మీడియా, నవంబర్ 18, ఖమ్మం బ్యూరో : జన శక్తి ముందు.. వందల కోట్లు లెక్క కాదని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.శనివారం నాడు పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో తుమ్మల పాల్గొని మాట్లాడుతూ..‘‘చారిత్రక ఘట్టం సత్తుపల్లితో మొదలవుతుంది. సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి మాత్రమే. నేను, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వేర్వేరు కాదు ఒక్కటే. అహంకారంకు, ఆత్మభిమానానికి మధ్య ఇప్పుడు పోటీ జరుగుతుంది. ప్రజల కోసం చిత్తశుద్ధితో యజ్ఞంలా రాజకీయం చేశా. సీతారామ ఇస్తానంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరాను. నా చిన్నప్పుడే దివంగత నేత నందమూరి తారక రామారావు నాకు మంత్రి పదవి ఇచ్చారు. నాకు మంత్రి పదవి అవసరం లేదు.. మంత్రి పదవి కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ముఖ్య మంత్రులు ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే సత్తుపల్లి నెంబర్ వన్. 80, 90 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసేందుకు వస్తున్నారు.

Also Read : మెచ్చాకు బిగుస్తున్న ఓటమి ఉచ్చు

సత్తుపల్లి అభ్యర్థి మట్టా రాగమయిని గెలిపిస్తే మేం గెలిచినంత సంతోష పడతాం. ప్రజల శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు. పది రోజులు మీరు కష్టపడాలి.. ఆ తర్వాత మేం కష్టపడతాం. ప్రజా అభిమానంతో 40 ఏళ్లుగా ప్రజల ముందు ఉంటున్నాను. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తాం’’ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube