ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై యాపిల్కు నోటీసులు ఇచ్చిన కేంద్రం
ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై యాపిల్కు నోటీసులు ఇచ్చిన కేంద్రం
ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై యాపిల్కు నోటీసులు ఇచ్చిన కేంద్రం
టీ మీడియా, నవంబర్ 2, న్యూఢిల్లీ : దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపింది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్ అలర్ట్’ సందేశాలు రావడం సంచలనంగా మారింది. ఈ అంశంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ.. యాపిల్ సంస్థకు గురువారం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. తమ నోటీసులపై వెంటనే స్పందించాల్సిందిగా యాపిల్ సంస్థను మంత్రిత్వ శాఖ కోరింది. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎన్.కృష్ణన్ ధ్రువీకరించారు. మరోవైపు హ్యాకింగ్ ఆరోపణలపై భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Also Read : ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube