కళ్లు తెరిచిన లక్ష్మీదేవి విగ్రహం.. బారులు తీరిన భక్తులు

కళ్లు తెరిచిన లక్ష్మీదేవి విగ్రహం.. బారులు తీరిన భక్తులు

1
TMedia (Telugu News) :

కళ్లు తెరిచిన లక్ష్మీదేవి విగ్రహం.. బారులు తీరిన భక్తులు

లహరి, నవంబర్ 22, తూర్పుగోదావరి జిల్లా : సనాతన హిందూ ధర్మానికి నెలవు భారత దేశం. దేవుళ్ళనే కాదు.. ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం హిందువుల సొంతం. దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు..

అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం.. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక సంఘటనలను రుజువుగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో పవిత్ర కార్తీక మాసం వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో వింత సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది. సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లుగాని, సగం మాత్రమే తెరిచి ఉన్న ట్టుగా ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. నవంబరు 21న ఆఖరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Also Read : కాంగ్రెస్‌కు మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా

ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం అంతరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త క్షణాల్లో దావానలంలా ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో భక్తులు ఆ వింతను చూడటానికి పోటెత్తారు. కళ్లుతెరిచి దర్శనమిచ్చిన లక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజున ఈ వింత చోటు చేసుకోవడంతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube