కెసిఆర్ మ‌రోసారి గెలిస్తే.. ఆర్టీసీ ఆస్తులు దోపిడే

కెసిఆర్ మ‌రోసారి గెలిస్తే.. ఆర్టీసీ ఆస్తులు దోపిడే

0
TMedia (Telugu News) :

కెసిఆర్ మ‌రోసారి గెలిస్తే.. ఆర్టీసీ ఆస్తులు దోపిడే

టీ మీడియా, నవంబర్ 16, క‌రీంన‌గ‌ర్ : మ‌రోసారి కేసీఆర్ మ‌రోసారి గెలిస్తే ఆర్టీసీ ఆస్తుల‌ను దోచేస్తారని బిజెపి జాతీయ కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ ఆరోపించారు..ముగ్దుంపురం ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 200 మంది నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ సిద్ధాంతాలు, బండి పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని ఆసిఫాబాద్ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ. ఇప్పటికే కెసిఆర్ కుటుంబం పేరుతో ఆర్టీసీ ఆస్తి పత్రాల రెడీ అయ్యాయ‌ని,. 99 ఏళ్ల లీజు పేరుతో దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను మీ పక్షాన యుద్దం చేస్తున్న నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నార‌న్నారు. ..

Also Read : ప్రజల్లో చిచ్చుపెట్టి, అభివృద్ధి పట్టని పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలి

మీపక్షాన పోరాడే నాలాంటోళ్లకు అండగా నిలవండి అని కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ వినతి చేశారు. సొమ్ము కేంద్రానైతే గంగుల సోకు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే ఆర్వోబీ, స్మార్ట్ సిటీ సహా కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముగ్దుంపురలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube