7 నెలల్లో ప్రెస్ క్లబ్ ఆదాయం రు57 వెలు
– ఖర్చు రు:63 వెలు
టీ మీడియా,ఆగస్టు10,ఖమ్మం సిటీ: నగరం లోని ప్రెస్ క్లబ్ కి జనవరి నుండి జూన్ వరకు 7 నెలలో 56,000 రూపాయలు ఆదాయం,రు63,069 ఖర్చు అయింది అని ,విరాళం పోను రు 3,567 లు లోటు ఉన్నట్లు గా ప్రెస్ క్లబ్ బాధ్యులు పేరున శ్వేత పత్రం అంటూఓక కాయితం బైటకు వచ్చింది . దాని పై రెండు జర్నలిస్ట్ యూనియన్ ల పేరుతో సంతకాలు ఉన్నయి.ఇది ఇలా ఉంటే ఆదాయం ఏవిధంగా వచ్చింది, ఖర్చులు ఏంటి ,లోటు మొత్తం అప్పు నా అయితే ఎవరు ఇచ్చారు అన్నది మాత్రం వెల్లడి చెయ్యలేదు.ఇందుకు సనందించిన వివరాలు తెలియాల్సి ఉంది.ప్రెస్ క్లబ్ ఆదాయం ,విరాళాలు జమకు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఉన్నదా అన్న ది స్పష్టత లేదు. లెక్కల కాగితం పై సంతకం చేసిన వారి లో ఇద్దరు మాత్రమే తమ పేర్లు రాశారు.మిగిలిన వారి పేర్లు లేవు. కేవలం రెండు యూనియన్ లు కు చెందిన వారిని కాగితం (శ్వేత పత్రం)లో పైన పేర్కొన్న విధంగా బాధ్యులు గా ఎవరు నియామకం చేశారు,అందుకు అవలంబించిన ప్రాతి పథిక ఎంటి అన్నది తెలియాల్సి ఉంది

also read :అధాని గ్రూప్ పేరుతో అక్రమం
అదే కాయితం లో క్రింద అద్యక్షులు ,కార్యదర్శులు అని రాసి ఉంది ఈ కమిటీ ఎన్నిక ఎప్పుడు జరిగింది అన్నది లేదు. సహజంగా ఇటువంటి లెక్కలు బహిర్గతం చేసే సందర్భం లో సమందిత సంస్థ రీజిస్టేషన్ నెంబర్,అడ్రస్ ఇతర వివరాలు ఉన్న లెటర్ హెడ్ పై రాసి ,ఫలానా రోజు,ఫలానా చోట జరిగిన సమావేశం లో ఆమోదించి నట్లు పేర్కొని ఆ వివరాలు తో పత్రికా ప్రకటన చెయ్యడం చేస్తారు.అందుకు విరుద్ధం గా , ఓక అకౌంట్ బుక్ గీత ల తో ఉన్న పేపర్ పై రాయడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది.ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో కమ్యూనిటీ హాల్ గా ప్రస్ క్లబ్ నిర్వహణ భవనం ఉన్నట్లు సమాచారం.అదే నిజం అయితే ఇక్కడి ఆదాయం,వ్యయం లెక్కలు మున్సిపల్ ఆడిట్ అధికాలు కు అంద చేయాల్సి ఉంటుంది. సమాజం కు నాల్గవ స్థంభం అయిన జర్నలిజం కు ప్రతినిధుల క్లబ్ లెక్కల పై శ్వేత పత్రం ఈ విధంగా ఇవ్వటం మంచిగా లేదు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శ్వేత పత్రం అంటే అన్ని రకాల పూర్తి వివరాలు తో ఉండాలి అని పేర్కొంటున్న రు.అందరినీ ప్రశ్నించే పత్రికల ప్రతినిధులు కు ఇది సరికాదు అనే అభిప్రాయం వస్తోంది.
శ్వేత పత్రం
ఏ దేని విషయం, సమస్య పైన నిర్ణయాలు తీసుకోడం, పరిష్కరించడం గురించి చదువరులకు పూర్తి అవగాహన కల్పించేందుకు విడుదల చేసే సాధికారిక నివేదిక/గైడు నీ శ్వేతపత్రం (white paper) అంటారు. ఇవి రెండు రకాలు. ప్రభుత్వానికి సంబంధించినవి, వ్యాపారులకు సంబంధించినవి.
ప్రభుత్వాల శ్వేతపత్రాలు
శ్వేత పత్రం అనే పరిభావన, ప్రభుత్వాల నిర్వహణ నుండే పుట్టింది. చాలామంది 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసినదానినే, మొదటి శ్వేతపత్రంగా భావిస్తారు. శ్వేత పత్రాలు, “ఒక విషయం మీద ప్రభుత్వ విధానాలను వివరిస్తూనే, మరో పక్క వాటిపైని అభిప్రాయాలను అహ్వానిస్తాయి”.
ఇతర రంగాల శ్వేతపత్రాలు
1990 ప్రాంతాలలో వ్యాపారరంగంలో కూడా శ్వేత పత్రాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఇవి ప్రధానంగా మార్కెటింగు, అమ్మకాలకు సంబంధించినవై ఉన్నాయి. ఎక్కువ శాతం, “ఫలాని” వ్యూహం “ఫలానా” సమస్యకు పరిష్కారం అంటూనో, వ్యాపారస్థులు సొంత విడుదలను విశదీకరిస్తూనో ఉంటాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube