చెరువులో పడి ముగ్గురు పిల్లల దుర్మరణం..

చెరువులో పడి ముగ్గురు పిల్లల దుర్మరణం..

0
TMedia (Telugu News) :

  చెరువులో పడి ముగ్గురు పిల్లల దుర్మరణం..

 

టీ మీడియా, ఏప్రిల్ 14, పెద్దపెల్లి :జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రెండో డివిజన్ లోని న్యూ పీకే రామయ్య క్యాంప్ చెరువులో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఈరోజు ఉదయం న్యూ పోరట్ పల్లికి చెందిన విక్రమ్, ఉమా మహేష్, సాయి చరణ్ ఉదయం సమీపంలోని న్యూ పీకే రామయ్య కాలనీ చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన ఈ ముగ్గురు నీటిలో మునగడంతో స్థానికులు గమనించి స్థానిక గోదావరిఖని ప్రభుత్వ హస్పటల్ తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. గవర్నమెంట్ హాస్పిటల్ కు చేరుకున్న గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్ ఐ జీవన్ ప్రమాదంకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిదండ్రుల ఆర్తనాదాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

 

AlsoRead:అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube