సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

0
TMedia (Telugu News) :

సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

– సిఐడి చీఫ్‌ ఎన్‌ సంజయ్

టీ మీడియా, నవంబర్ 9, అమరావతి : రాష్ట్రంలో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్‌ మీడియాతో అసభ్యంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐడి చీఫ్‌ ఎన్‌ సంజరు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్ట్‌లపై నిఘాను పెట్టామని తెలిపారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డిపైన వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్‌ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ గుర్తించామని.. నిందితుల ఆస్తులు కూడా అటాచ్‌ చేసే దిశగా చర్యలు వుంటాయని తెలిపారు. ప్రతిపక్ష నేతలపై సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులపైనా కూడా చర్యలు ఉంటాయని అన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.

Also Read : షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. టీఆర్‌ఎఫ్‌ ఉద్రవాది హతం

విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఆయా దేశాల ఎంబసీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. 202 సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను మానిటరింగ్‌ చేస్తున్నామని వెల్లడించారు. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్‌ మీడియా అకౌంట్స్‌ గుర్తించామని అన్నారు. అసభ్య పోస్టులను షేర్‌, లైక్‌ చేస్తున్న వారిపై 2,972 సైబర్‌ బుల్లయింగ్‌ షీట్స్‌ ఓపెన్‌ చేసినట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube