మిషన్ భగీరథ పనులను పరిశీలన

మిషన్ భగీరథ పనులను పరిశీలన

0
TMedia (Telugu News) :

మిషన్ భగీరథ పనులను పరిశీలన

టీ మీడియా, ఫిబ్రవరి 7, వనపర్తి బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ వనపర్తి మున్సిపాలిటి పరిధిలోని 30వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పరిశీలించి దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గం రానున్న 50 సంవత్సరాల వరకు తాగునీటి కొరత లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికను ఆలోచించి 330 కోట్లకు రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో మిషన్ భగీరథ పైప్లైన్లు ట్యాంకులను డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా వనపర్తి పట్టణంలో 82 కిలోమీటర్ల పైప్ లైన్లను 5 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను రెండు జిఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులను పనులు పూర్తి కావచ్చయని పూర్తయిన పైపులైన్లకు లింకులు కలిపే పని ప్రస్తుతం జరుగుతుందని అదేవిధంగా

Also Read : నిరుపేద ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మీ

మిషన్ భగీరథలో పైప్లైన్ల కోసం పోయినా రోడ్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిసి రోడ్ల నిర్మాణాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో గతంలో లేని విధంగా ఎంతో నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తద్వారా పట్టణానికి ఒక నూతన శోభ వచ్చిందని తెలియజేశారు. మిగతా రోడ్లను కూడా రిపేరు చేసి పూర్తి చేస్తారని తెలియజేశారు. ప్రత్యేక కృషి చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి రాష్ట్ర పురపాలక సంఘ మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube