ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
— నిఘా నేత్రల కనుసన్నులలో పరీక్షల నిర్వహణ
– చీఫ్ సూపరిండెంట్ రఘురామ్
టి మీడియా, మే 6,చింతూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరిండెంట్ బి. రఘురామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంగా జరగనున్న పరీక్షలకు గురుకులం జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం సుమారు 323 మంది పరీక్షలు రాయనున్నారు అని, వీరి కోసం ఇప్పటికే గదులను అన్ని సదుపాయాలతో సిద్ధం చేశామని,
Also Read : ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ 2 వ నూతన గేట్ పనులు ప్రారంభం
వైద్య సిబ్బంది ని అందుబాటులో ఉంచుతున్నామని,అన్ని గదులకు నిఘా నేత్రాలను అమర్చినట్టు తెలిపారు.పరీక్షలు ఎటువంటి మాస్ కాఫీయింగ్ కి తావు లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తామని చీప్ సూపరిండెంట్ రఘురామ్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అశోక్ చంద్ర శేఖర్, స్పెషల్ ఆఫీసర్ నాగమణి తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube