బిఎస్పీ లో కి కండువా కప్పి ఆహ్వానం
– బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
also read :మదన్ లాల్ పై మన్మధ ప్రచారం వెనుక భారి మతలభ్ ..?
టీ మీడియా,ఆగస్టు 21 పెద్దపల్లి : పట్టణనికి చెందిన 25వ వార్డ్ ఎంఐఎం కౌన్సిలర్ కనుకుర్తి కార్తిక్ బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జి దాసరి ఉష ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లి స్వగృహం నందు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బిఎస్పీ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది.వారితో పాటు బీసీ సంఘం అధికార ప్రతినిధి సబ్బు సతీష్ ముదిరాజ్,బొంకూరి సాగర్,మహమ్మద్ సిద్ధిక్,సయ్యద్ సమీర్,ఎస్ కె అర్బాజ్,మహమ్మద్ మోయిన్,మహమ్మద్ షాన్వాజ్,కి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలన్న, విద్యార్థుల చదువులు ఉన్నతంగా ఉండాలన్న, నిరుద్యోగులకు అవినీతి లేని ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలన్నా కేవలం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని, బహుజన రాజ్యాధికారం దిశగా సాగుతున్న ఉద్యమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష, పెద్దపల్లి అసెంబ్లీ కోశాధికారి రియాజ్, పెద్దపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం. డి.అజీమ్,ఎండి. సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube