ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చేయండి

బాధితులకు న్యాయం చేయకుంటే ఆమరణ దీక్షకు సిద్ధం

0
TMedia (Telugu News) :

ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చేయండి

-బాధితులకు న్యాయం చేయకుంటే ఆమరణ దీక్షకు సిద్ధం

-ఏఐవైఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య

టి మీడియా,జనవరి 27,గోదావరిఖని : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు పెట్టిస్తామని నిరుద్యోగ యువకులను మోసగించి స్థానిక శాసనసభ్యుని అండతో దళారులు కోట్ల రూపాయలు వసూలు చేసి నిరుద్యోగుల జీవితాలను రావణ కాష్టంగా మార్చడాన్ని నిరసిస్తూ అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఆర్ ఎఫ్ సి ఎల్ అమరుడు ముంజ హరీష్ చిత్రపటానికి శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సంధర్భంగా ఏఐవైఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య మాట్లాడుతూ…స్థానిక శాసనసభ్యులు అండతో ఆర్ ఎఫ్ సి ఎల్ దళారులు నిరుద్యోగ యువకులకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు పెట్టిస్తామని వందలాదిమంది నిరుద్యోగుల దగ్గర ఐదు నుండి పది లక్షలు, దాదాపుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ లో కాంట్రాక్టర్ మారినా అనంతరం ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో దళారులకు ఇచ్చిన డబ్బులకు సంబంధించిన అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటుంటే వారిని ఆదుకోకుండా ఎమ్మెల్యే అండతో దళారులు దాటవేత ధోరణితో ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఆర్ ఎఫ్ సి ఎల్ దళారుల పై సి బి సి ఐ డి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : నేటి అక్షరమే రేపటి దేశ యువ కిరణం

ఈ మొత్తం అవినీతిలో ఉన్నటువంటి దళారుల ఆస్తులను జప్తు చేసి ఆర్ ఎఫ్ సి ఎల్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి లేని పక్షంలో అఖిలభారత యువజన సమైక్య పక్షాన పోరాటం మరింత ఉధృతం చేస్తామని నెల రోజుల్లో బాధితులందరికీ డబ్బులు చెల్లించని పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆమరణ దీక్ష కూర్చుంటామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు సాదుల శివకుమార్,ఆసాల నవీన్,శనిగరపు చంద్రశేఖర్,రాణవేణి సుధీర్,కోడం సునీల్, భూసారపు రాజు,పునీంద్ర, కరీం పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube