కర్ణాటక ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
టీ మీడియా ఆగస్టు 6, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు సీఎం అధికారికంగా ప్రకటన చేశారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న తాను కొవిడ్ టెస్టులు చేయించుకోగా, కరోనా పాజిటివ్గా నిర్ధారించబడిందని సీఎం తెలిపారు.
Also Read : ఒమిక్రాన్ వేరియంట్లే ఎక్కువగా వ్యాపిస్తున్నాయి
ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా బారిన పడిన నేపథ్యంలో ఢిల్లీ టూర్ను వాయిదా వేసుకుంటున్నట్లు బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. జులై 25, 26 తేదీల్లో బొమ్మై ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమంలో కర్ణాటక సీఎం పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube