కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం
-విజేతకు రూ.50 వేల బహుమతి
టీ మీడియా,ఫిబ్రవరి 1,పెద్దపల్లి : కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. బుధవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు.పట్టణంలోని 11వ వార్డు 14వ వార్డు మధ్య మొదటి మ్యాచ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామస్థాయిలో,మండల స్థాయిలో,మున్సిపాలిటీ పరిధిలో వార్డు పరిధిలో పోటీ నిర్వహించి విజేతలకు నియోజకవర్గస్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతకు 50 వేల రూపాయల నగదు బహుమతి రన్నర్ కు 25వేల రూపాయల నగదు బహుమతి అందిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ప్రమాణాలతో విద్యకు మన బస్తీ-మన బడి
క్రీడాకారులు గెలుపోవటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దాసరి మమతా-ప్రశాంత్ రెడ్డి,ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube