లక్షల కోట్ల సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు

రాజకీయాలు జరుగుతుంటాయి -గెలుపు ఓటములు సహజం

0
TMedia (Telugu News) :

లక్షల కోట్ల సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు

– రాజకీయాలు జరుగుతుంటాయి

-గెలుపు ఓటములు సహజం

– ఖమ్మం సభలో సీఎం కేసీఆర్‌

 

టీ మీడియా, జనవరి 18,ఖమ్మం :భారత సమాజం లక్ష్యం ఏంటి.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా.. బిత్తరపోయి గత్తర పడుతుందా.. ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో.. ఈ విషయం మీద నా అంతరాత్మ అనేక రకాలుగా కలిచి వేస్తా ఉంది. అందరూ సీరియస్‌గా ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు.దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు తీసుకునే అవసరం లేనటువంటి .. ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి.. ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి.. సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని కేసీఆర్‌ అన్నారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. దేశంలో సంపద లేకుంటే బిక్షం ఎత్తుకుంటే తప్పులేదు. కానీ ఉండి మనం ఎందుకు యాచకులం కావాలని ప్రశ్నించారు.

 

Also Read : హెడ్‌ క్వార్టర్‌లో జర్నలిస్టుందరికీ ఇండ్ల స్థలాలు : సీఎం కేసీఆర్

 

జిల్లాకు వరాల జల్లు

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు.*
జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.పెద్దతండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండిమేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.మంత్రి అజయ్ గారి కోరిక మేరకు ఖమ్మం కార్పోరేషన్ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లి కి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పువ్వాడ విన్నపం మేరకు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. కాల్వొడ్డు మున్నేరు నది పైన నూతన వంతెన నిర్మాణం కొరకు హామీఇచ్చరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube