కశ్మీర్లో లష్కరే ఉగ్రవాదులు హతం
టీ మీడియా, జనవరి 17, బుద్గామ్ : జమ్మూకశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు మృతిచెందారు. ఓ అనుమానిత వాహనాన్ని ఆర్మీ, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ వాహనంలో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో జరిగిన ప్రతిదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. ఆ వాహనం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రికవరీ చేశారు. ఆ ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల్ని అర్బాజ్ మీర్, షాహిద్ షేక్లుగా గుర్తించారు. పుల్వామాకు చెందినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..
ఇటీవల కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ నుంచి ఆ ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాద కదలికలపై సమాచారం రావడంతో.. బుద్గామ్లో చెక్ పాయింట్ను ఏర్పాటు చేసినట్లు ఆర్మీ అధికారి తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube