కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన లావణ్య
టీ మీడియా, అక్టోబర్ 5, వనపర్తి బ్యూరో : తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు బుధవారం కానిస్టేబుల్ తుది ఫలితాలు వెల్లడించగా వనపర్తి పట్టణంలోని గాంధీనగర్ చెందిన ఏర్పుల శ్రీరాములు యాదవ్, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె ఎర్పుల లావణ్య కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. తండ్రి శ్రీరాములు మాధవరావుపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి గృహిణి. లావణ్య పదో తరగతి వరకు పట్టణంలోని సెయింట్ థామస్ స్కూల్లో, పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా, హైదరాబాదులోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2021 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసింది.
Also Read : పెబ్బేరులో డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
లావణ్య ఎలాంటి కోచింగ్ లేకుండా స్వతహాగా చదివి తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించినట్లు లావణ్య పేర్కొన్నది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube