న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి: జస్టిస్ ఎన్వీ రమణ
టీ మీడియా ,జులై 30,న్యూఢిల్లీ: జిల్లా న్యాయ స్థానాలను మరింత బలోపేతం చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా న్యాయ ఉద్యమాన్ని చేపట్టడంలో జిల్లా కోర్టులు చోదకాలుగా పనిచేస్తాయన్నారు. చాలా వరకు కేసుల్లో జిల్లా జుడిషియల్ అధికారులే కాంటాక్ట్లోకి వస్తారని, జిల్లా న్యాయస్థానాల వద్ద తమకు కలిగిన అనుభవాల ద్వారానే న్యాయవ్యవస్థపై ప్రజల్లో ప్రజాభిప్రాయం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
Also Read : మంకీఫాక్స్ అనుమానిత కేసు నమోదు
ఢిల్లీలో జరిగిన నల్సా తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు అత్యంత అవసరమని, దేశంలో న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా న్యాయస్థానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube