శాసన మండలి సమావేశాలు వాయిదా
టీ మీడియా, ఫిబ్రవరి 6, హైదరాబాద్ : శాసనసభ, శాసన మండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 8న బడ్జెట్పై చర్చ జరగనుంది. 9,10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. 12వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించనున్నారు. అనంతరం సమావేశాలు వాయిదా పడనున్నాయి. ఈ నెల 3వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.