తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుదాం

తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుదాం

0
TMedia (Telugu News) :

తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుదాం

టీ మీడియా, ఫిబ్రవరి 21, వనపర్తి బ్యూరో : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్లలో అక్షర దీక్ష కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు నారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.పాశ్చాత్య పెడ ధోరణిలను, విచిత్రమైన హెయిర్ కటింగ్ లను, చిరిగిపోయిన దుస్తులను, ఫ్యాషన్లుగా భావించి ధరించవలసిన అవసరం లేదని తెలుగువారి కట్టుబట్టలను, సంప్రదాయాలను పాటించాలని, తెలుగు భాషా సౌందర్యాన్ని చక్కటి తెలుగు పద్యాల ద్వారా వివరించారు. మాతృభాషా దినోత్సవం ఏర్పడడానికి ఉన్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు వ్యాకరణానికి సంబంధించి ఒక గేయాన్ని పాడారు. తెలుగులో పద్యాలు చెప్పారు. తాము సొంతంగా రాసిన చిన్న చిన్న కవితలను వినిపించారు.

Also Read : నీతి ఆయోగ్ సీఈవోగా తెలుగు అధికారి

ఈ సందర్భంగా నారాయణ రెడ్డి ని పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శంకర్ గౌడ్, తెలుగు ఉపాధ్యాయురాలు నాగేశ్వరమ్మ, ఉపాధ్యాయ బృందం వెంకటేశ్వర్లు గౌడ్, విష్ణువర్ధన్, సురేఖ, చంద్రకళ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube