మహానంది ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అవసరం
టీ మీడియా, ఏప్రిల్ 30, మహానంది:
మహానంది ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అవసరమని మహానంది ఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అమలాపురం పట్టణానికి చెందిన హరిత ట్రేడర్స్ యజమానులు మోటుపల్లి సత్తిబాబు, శ్యాంసుందర్ లు ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి పది టన్నుల బియ్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.
Also Read : రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే
అలాగే విజయవాడకు చెందిన వారి మిత్రుడు విక్రమ్ సింగ్ రాథోడ్ శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి 12 పట్టు చీరలు సమ్పరిస్తామని ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎర్రమల.మధు, సూపరింటెండెంట్ అన్నెం.ఈశ్వర్ రెడ్డి పాల్గొని వారికి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి అభినందించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube