మల్లన్న బ్రహ్మోత్సవాలకుఈ నెల 11న అంకురార్పణ

మల్లన్న బ్రహ్మోత్సవాలకుఈ నెల 11న అంకురార్పణ

0
TMedia (Telugu News) :

మల్లన్న బ్రహ్మోత్సవాలకుఈ నెల 11న అంకురార్పణ

లహరి, ఫిబ్రవరి9,అద్యాత్మికం : శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరగబోయే.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 11న సాయంత్రం మల్లన్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ జరుగనుంది. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పించనున్నారు. ఈ నెల 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు. ఈ నెల 16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం..

Also Read : అంగరంగ వైభవంగా జరిగిన సమతా కుంభ్‌ తెప్పోత్సవం

ఆ రోజు రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉండనుంది. అర్ధ రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 19న సాయంత్రం రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20న పూర్ణాహుతి కార్యక్రమం.. రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ ఉండనుంది. ఈనెల 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube