మణిపూర్లో-మరోసారి-ఉద్రిక్తతలు
– రెండు ఇళ్ళు దగ్ధం
టీ మీడియా, అక్టోబర్ 5, ఇంఫాల్ : ఉద్రిక్తతలతో మణిపూర్ అట్టుడుకుతోంది. తాజాగా గురువారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో హింస చెలరేగింది. సుమారు రెండు ఇళ్లకు నిప్పు పెట్టగా, పలు రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి 10 గంటల సమయంలో పట్సోయ్ పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూకెయిథెల్మన్బిలో ఈ ఘటన జరిగిందని అన్నారు. దాడి అనంతరం నిందితులు ఆ ప్రాంతం నుండి పారిపోయారని చెప్పారు. భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : చంద్రబాబు కస్టడీని పొడిగించండి : సీఐడీ
అక్కడ చేరిన మొయితీ మహిళా బృందం భద్రతా దళాలను అడ్డుకున్నాయని చెప్పారు. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించామని అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube