కాంగ్రెస్‌కు మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా

కాంగ్రెస్‌కు మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్‌కు మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా

టీ మీడియా, నవంబర్ 22, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్‌రెడ్డి ప్రకటించారు. తార్నాకలోని నివాసంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్‌ ఆయనను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. చాలా బాధతో రాజీనామాను చేస్తున్నానని, ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. పూర్తి వివరాలతో సోనియా గాంధీ లేఖ రాసినట్లు తెలిపారు. కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని, పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, తెలంగాణ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

Also Read : విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

కాంగ్రెస్‌ పార్టీకి హత్యం గుర్తు సూచించిన వారిలో తన తండ్రి ఉన్నారని శశిధర్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.కాంగ్రెస్‌ ప్రజల పక్షాన పోరాటం చేసిన కాంగ్రెస్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్‌లో నేటి పరిస్థితి ఊహించలేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube