గడ్డిపల్లి గ్రామం నుంచి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు
- బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన యూత్ నాయకులు, కార్యకర్తలు
గడ్డిపల్లి గ్రామం నుంచి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు
– బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన యూత్ నాయకులు, కార్యకర్తలు
టి మీడియా, నవంబర్ 6, హుజూర్ నగర్ రూరల్: నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం, గడ్డిపల్లి గ్రామం నుంచి..బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యూత్ నాయకులు, కార్యకర్తలు హుజుర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుజుర్ నగర్ ఎమ్మెల్యే. శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో.. బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. ఎమ్మెల్యే సైదిరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యూత్ నాయకులు, కార్యకర్తలు 20 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో ముఖ్యులు ; యడవల్లి బాటసారి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్సీ మోర్చా, యడవల్లి స్టాలిన్ ఏబీవీపి నాయకులు బీజేపీ అసెంబ్లీ ఫుల్ టైమర్, నందిపాటి గురువయ్య ఎంఆర్ పిఎస్ గ్రామ అధ్యక్షులు,
Also Read : ఎన్నికల ప్రచార వాహనం బోల్తా
కాంగ్రెస్ పార్టీ నుంచి అమరారపు లోకేష్ ,అమరారపు జానయ్య గంగారపు సైదులు, మెరిగె ప్రవీణ్, నందిపాటి అజిత్, కాంపాటి చరణ్, మెరుగే గణేష్, వల్లపుదాసు అజిత్ తదితరులు మొత్తం 20 కుటుంబాలు బీఆర్ఎస్ లో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో గడ్డిపల్లి స్థానిక ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube