మెడికల్ కాలేజీ మంజూరుతో…
జిల్లా కేంద్రంలో బాణా సంచా తో సంబరాలు
టీ మీడియా, మార్చి 07, ములుగు జిల్లా బ్యూరో:సోమవారం రోజున అసెంబ్లీలో ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ హాజరయ్యారు.కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కుసుమ జగదీష్ మాట్లాడుతూ..సీ ఎం కేసీఆర్ ప్రజల మనోభావాలు ఎరిగిన మనిషి.ప్రజల యొక్క అవసరాలు గుర్తించి ములుగు జిల్లా ప్రకటించారు.
also read:వెల్లోకి వచ్చినందుకే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
ఇప్పుడు మెడికల్ కాలేజీ మంజూరు చేశారు.మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ములుగు జిల్లా ప్రజల పక్షాన హృదయ పూర్వక సాంష్టంగా నమస్కారాలు.చాలా సంతోషం.ములుగు జిల్లా అభివృద్ధికి ఇది తొలి అడుగు.ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోజిల్లాను ఇంకా అభివృద్ధి పథంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తారు.ప్రజల సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్,జడ్పీటీసీ కుమారి సఖినాల భవాని,రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,పోరిక గోవింద్ నాయక్,పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube