మెడికో ప్రీతి మృతి కేసులో సైఫ్‌కి బెయిల్

మెడికో ప్రీతి మృతి కేసులో సైఫ్‌కి బెయిల్

0
TMedia (Telugu News) :

       మెడికో ప్రీతి మృతి కేసులో సైఫ్‌కి బెయిల్

 

టి మీడియా, ఏప్రిల్ 20,వరంగల్: ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల బాండ్, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర నిందితుడు సైఫ్ కు బెయిల్ మంజూరు చేశారు.ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధ విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే నాటికి లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని నిందితుడు, సీనియర్ విద్యార్థి సైఫ్ నకు ఆదేశించింది కోర్టు. అయితే ప్రీతి డెత్ కేసులో సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను మూడుసార్లు న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో 56 రోజుల తరువాత నిందితుడు సైఫ్ జైలు నుంచి విడుదలఅవకాశం ఏర్పడింది .

 

AlsoRead:స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్‌కు సింగరేణి దూరం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube