తవ్వకాలు జరుగుతుండగా కూలిన గని
– ఏడుగురు దుర్మరణం
టీ మీడియా, డిసెంబర్ 2, రాయ్పూర్ : చత్తీస్ఘడ్లోని మాలగావ్లో శుక్రవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ గని కూలడంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా మరో పన్నెండు మందికి పైగా శిధిలాల్లో చిక్కుకున్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టింది. శిధిలాల్లో చిక్కుకున్న గ్రామస్తులను బయటకు తీసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇక మరణించిన ఏడుగురిలో ఆరుగురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.
Also Read : జాత్యహంకార ధోరణిని ఎదిరించాలి : బ్రిటన్ ప్రధాని
మైన్ కూలడంతో సమీపంలోని రెండు గ్రామాల ప్రజలను అదికారులు ఖాళీ చేయిస్తున్నారు. తవ్వకాలు జరుగుతుండగా అనూహ్యంగా గని కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం వెలుగుచూడాల్సి ఉంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube