నామినేషన్ దాఖలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
టీ మీడియా, నవంబర్ 9, సూర్యాపేట : సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. 2001లో రాజకీయ ప్రవేశం చేసిన జగదీశ్ రెడ్డి.. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
Also Read : సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునే విధంగా పని చేసాను
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube